గుండెను ఆగనివ్వొద్దు

ఆసుపత్రికి తీసుకొచ్చే సరికే ప్రాణం పోయింది. గుండెపోటు వచ్చిన వెంటనే సిపిఆర్ చేసినా ప్రాణం దక్కేది.‘ – ఇంచుమించుగా ఇటువంటి డైలాగ్‌లు భూమ్మీద ఎక్కడో ఒక దగ్గర పేషెంటు పక్కన ఉన్న వాళ్లతో డాక్టరు చెప్తుంటాడు. డాక్టర్లే ఏమీ చేయలేనప్పుడు మనమేం చేయగలంఅనుకుంటాం మనం. ఆ ఆలోచనే పొరపాటు. గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలను కాపాడడం మీ చేతుల్లోనే ఉంటుంది. సిపిఆర్ ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తానుఅంటున్నారు డాక్టర్ అపర్ణ యలమంచిలి. ఈవిడ యుకె, బర్మింగ్‌హామ్‌లో ఫ్యామిలీ ఫిజిషియన్‌గా చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చి మరీ ఇక్కడ నేర్పించాలనే ఆలోచనకి కారణమేమిటో అపర్ణ మాటల్లోనే…

image003
గుండెపోటుకి గురయిన వ్యక్తికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సిపిఆర్ (ఛ్చిటఛీజీౌఞఠజూఝౌn్చటడ ఖ్ఛటఠటఛిజ్ట్చ్టీజీౌn (కార్డియో పల్మొనరీ రిససిటేషన్)) చేస్తే ఆ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టొచ్చు. డాక్టర్లో, పారామెడికల్ సిబ్బందో సిపిఆర్ చేయాలనేమీ లేదు. నేర్చుకుంటే మీరు కూడా చేయొచ్చు ఆ పని. నేర్చుకోవడం పెద్ద కష్టమూ కాదు. యుకెలో సిపిఆర్‌ను దాదాపు ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారు. మన దేశంలో గుండెపోటు వల్ల సంభవించే మరణాలు ఎక్కువే. అయినా సిపిఆర్ పట్ల అవగాహన మాత్రం చాలా తక్కువ.

గుండెపోటుతో మనిషి పడిపోయిన తరువాత అంబులెన్స్ వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు పోతున్నాయి. ఇలా ప్రాణాలు కోల్పోతున్న వాళ్ల సంఖ్య తగ్గించాలంటే ప్రతి ఒక్కరికీ సిపిఆర్ శిక్షణ అవసరం. మొదట ఎక్కువమంది పనిచేసే కార్యాలయాలు, కార్పొరేట్ ఆఫీసులు, బ్యాంకులు, మీడియా సంస్థలు, పాఠశాలల్లో దీన్ని నేర్పిస్తే ఎక్కువ ఉపయోగం. అందుకే హైదరాబాద్‌లో నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను.

అమ్మ మరణంతో…
ఈ ఆలోచన రావడానికి కారణం మా అమ్మ మరణం. తను గుండెపోటుతో హైదరాబాద్‌లో డిసెంబర్ 2010లో మరణించింది. నన్ను పట్టుబట్టి డాక్టర్ చదివించిన అమ్మ ప్రాణాలు కాపాడేందుకు సమయానికి నేను ఆవిడ దగ్గర లేకపోవడం నన్నెంతో బాధకి గురి చేసింది. ఈ విషాదం జరిగినప్పుడు యుకెలో ఉన్నాను. మా అమ్మకి జరిగినట్టు మరొకరికి జరగకుండా ఉండేందుకే వీలైనంత ఎక్కువమందికి సిపిఆర్ నేర్పించాలనుకున్నాను. ఇది కార్యరూపం దాల్చేందుకు ఏడాదిన్నరకు పైగా శ్రమపడాల్సి వచ్చింది. యుకె నుంచే కార్పొరేట్ సంస్థల్ని, స్కూల్ యాజమాన్యాలను సంప్రదించాను.

కానీ ఎవరూ సరిగా స్పందించలేదు. కొందరయితే నా ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా మానేశారు. కాని సింపుల్‌గా ఉండే సిపిఆర్ పద్ధతిని తెలుసుకోవడం వల్ల విలువైన ప్రాణాన్ని కాపాడొచ్చనేది నా ఆశ. అందుకే పట్టువదలని విక్రమార్కిణిలా పదేపదే ప్రయత్నించాను. ఈ ఏడాది పంజాబ్‌నేషనల్ బ్యాంక్, కస్తూరి బాయి నేషనల్ ట్రస్ట్, కూకట్‌పల్లిలోని ఆలంబన సంస్థ తమ అంగీకారం తెలిపాయి.
image002
http://www.andhrajyothy.com/i/2013/mar/5nav-2.jpgసిపిఆర్ ఎలా చేయాలంటే…
గుండెపోటు వచ్చిన వ్యక్తిని మొదట తట్టి లేపాలి. ఆ తరువాత సిపిఆర్ చేయడం మొదలు పెట్టాలి. అయితే ఇదంతా కొన్ని సెకన్లలోనే జరిగిపోవాలి. గుండెపోటుతో పడిపోయిన వ్యక్తి ఛాతీ మీద రెండు చేతులు పెట్టి నొక్కాలి. ఒకవైపు ఇది చేస్తూనే మరో వైపు నోటి ద్వారా శ్వాస అందించాలి. నోటి ద్వారా శ్వాస అందించడానికి ఇన్‌ఫెక్షన్ల భయం వలన కొందరు వెనకాడతారు. అటువంటి వాళ్ల కోసం సిపిఆర్ ఫేస్ మాస్క్‌లు ఉన్నాయి.

వీటినే సిపిఆర్ కీ చెయిన్ మాస్క్‌లు అని కూడా అంటారు. ఈ మాస్క్‌ను నోటికి పెట్టుకుని శ్వాస అందివ్వడం వల్ల నోట్లోకి ఉమ్మి వెళ్తుందన్న సమస్య ఉండదు. శిక్షణ తరువాత ఈ కీ చెయిన్లను అందచేస్తున్నాను. ఇద్దరు మనుషులు కలిసి సిపిఆర్ చేస్తే ఫలితం బాగుంటుంది. ఒకరు తలను కాస్త వెనక్కి వంచి నోటి దగ్గర నోరు పెట్టి శ్వాసను అందిస్తుంటే మరొకరు ఛాతీ మీద ఒత్తిడి పెట్టాలి. ఒకవేళ ఇద్దరు అందుబాటులో లేకపోయినా ఒక్కరైనా ఇది చేయొచ్చు.

ప్రాణాల్ని నిలబెట్టేందుకు
సిపిఆర్‌తో పాటు ఆటోమేటిక్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిల్లేటర్‘ (ఎఇడి) కూడా నేర్పిస్తున్నాను. పేరు వినడానికి పెద్దగా ఉన్నా సింపుల్‌గా చెప్పాలంటే దీనికి రెండు ప్యాడ్స్ ఉంటాయి. సినిమాల్లో, టివి సీరీయల్స్‌లో చాలాసార్లు చూసే ఉంటారు. వీటిని గుండె పోటు వచ్చిన వ్యక్తి ఛాతీమీద పెట్టి షాక్ ఇస్తారు. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎఇడిలే షాక్ ఇవ్వండి, ఆపండిఅంటూ సజెషన్స్ ఇస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తుంటాయి. ఇటువంటి వాటిని పెద్ద పెద్ద కార్పొరేట్ కార్యాలయాల్లో ఫ్లోర్‌కి ఒకటి ఉంచితే ఎంతో ఉపయోగకరం. దీనివల్ల గుండెపోటు వచ్చిన వ్యక్తి జీవించే అవకాశాలు 30 నుంచి 50 శాతం పెరుగుతాయి.

సిపిఆర్ శిక్షణకి ఒక్కొక్కరి దగ్గర 75 రూపాయల ఫీజు కట్టించుకుంటున్నాను. ఆ డబ్బుని మా అమ్మ పేరు మీద ఏర్పాటుచేసినఆనందకుమారి ట్రస్ట్కి అందిస్తున్నాను. ఈ ట్రస్ట్ ద్వారా పేద, మెరిట్ విద్యార్థులకి ఆర్థికసాయం అందిస్తున్నాం. అవసరమైన వాళ్లకి వైద్యానికి సాయం కూడా చేస్తున్నాం. నేనిక్కడ మార్చి నెలాఖరు వరకు ఉంటాను. వీలయినంత ఎక్కువమందికి సిపిఆర్ ఎలా చేయాలో నేర్పిద్దామనేది నా ఆలోచన. మీరు నేర్చుకుంటే వేరొకరికి విలువైన జీవితాన్ని ఇవ్వగలుగుతారు. ఆసక్తి ఉన్న సంస్థలు, బ్యాంక్‌లు, విద్యాలయాలు 99593 84940 నంబరులో నన్ను సంప్రదించొచ్చు.

బ్రిటిష్ దొరగారి గారాల భారతీయుడు

britishదేశ విభజన జరిగినప్పుడు –
వదల్లేక వదల్లేక, దూరమవుతూ, మనసు భారమవుతూ…
వలస వంతెన కూలిపోయేలా… కోట్ల టన్నుల ఉద్వేగాలు!
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు -వందల ఏళ్లనాటి దాస్యం నుండి విముక్తి పొంది…
‘వందేమాతరాన్ని’ ప్రతిధ్వనించిన దిక్కులు, చుక్కలు!
అంతేనా? ఫ్రీడమ్ ఒక్కటే ఆ వేళ అందరి ఫీలింగా?
వెళ్లిపోతున్న బ్రిటిష్‌వాళ్లకు, అంతవరకూ ‘పో… పొమ్మన్న’ ఇండియన్స్‌కి మధ్య…
ఎక్కడా చిన్న ఎమోషనైనా మిగలకుండా పోయిందా?
‘పోలేదు’ అంటున్నారు జి.పి.రెడ్డి!
‘మాతో వచ్చెయ్ కూడదా?’ అని బెంగగా అడిగిన
ఓ బ్రిటిష్ అధికారి కుటుంబంతో…ఈ ‘భారతీయుడికి’ ఉన్న పుత్రానుబంధమే ఇవాళ్టి స్పెషల్ స్టోరీ!
ఎనభైఏళ్ల కిందట రోడ్డుపై జరిగిన ఓ చిన్న సంఘటన జి.పి.రెడ్డి జీవితాన్నే మార్చేసింది. ఓ నిండు భారతీయుడిని బ్రిటన్‌కి ఆప్తుడిగా చేసింది. ‘తెల్లోలకున్న నిజాయితీ మనకాడ లేదు’ అని ఈ పెద్దాయనన్న మాటల్లో ఎంతో ఆవేదన తొణికిసలాడింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం కరీంగూడ గ్రామంలోని ఒక వ్యవసాయక్షేత్రంలో (ప్రస్తుతం మౌలాలిలో ఉంటున్నారు) మొన్నటివరకూ కాలం గడిపిన ఈ పెద్దాయన గురించి ఆసక్తికరమైన విషయాలివి…ఆరేడేళ్ల వయసులో ఉన్న ఓ నలుగురు పిల్లలు రోడ్డుపక్కన ఫుట్‌బాల్ ఆడుతున్నారు. రోడ్డుపై బ్రిటిష్ అధికారుల కార్లు వరసగా వెళుతున్నాయి. సడెన్‌గా బాల్ రోడ్డుపైకి వెళ్లింది. కార్లన్నింటికీ సడెన్‌బ్రేకులు పడ్డాయి. కార్లోంచి దిగిన తెల్లదొరలను చూడగానే పిల్లలందరూ పారిపోయారు ఒక్క జి.పి.రెడ్డి (గుండారపు పెంటారెడ్డి) తప్ప. కల్నల్ ఆఫీసర్ ఆర్‌డబ్ల్యూ బెనెట్ కారు దిగి రెడ్డిని దగ్గరికి పిలిచేలోపే… ఈ కుర్రాడు కారు దగ్గరికి వెళ్లి ‘‘దిసీజ్ మై బాల్’’ అన్నాడు. బెనెట్ కాస్త కోపంగా మొహంపెట్టి ఇంగ్లీషులో ‘‘అయితే కారు కిందకు దూరి తీసుకో’’ అన్నాడు. రెడ్డి మొహం ఎర్రగా చేసుకుని ‘‘నేను మా అమ్మానాన్నల దగ్గర తప్ప ఇంకెవరి ముందూ తలదించను. కారు ముందుకు కదలకపోతే అద్దాలు పగలగొడతాను’’ అని వార్నింగ్ ఇచ్చిన బాలుడి మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తెల్లదొరలు తెల్లమొహాలు వేశారు. బెనెట్ ఆ కుర్రాడిని ఎత్తుకుని ఓ ముద్దిచ్చి…‘‘మీ అమ్మానాన్నల దగ్గరకు తీసుకెళ్లు’’ అని అడిగాడు.

మమ్మీడాడీ…

జి.పి.రెడ్డి తండ్రి బుచ్చారెడ్డి. హైదరాబాద్‌లోని లాల్‌బజార్ ప్రాంతంలో బ్రిటిష్ దుస్తుల సేల్స్‌మన్‌గా పనిచేసేవాడు. బెనెట్ అతడిని చూస్తూనే… ‘‘ఓ… రెడ్డిసాబ్ ఈ కుర్రాడు నీ కొడుకా… చాలా హుషారుగా ఉన్నాడు’’ అనగానే… ‘‘ఏం హుషారో ఏమో సార్… ప్రతిరోజు ఏదో ఒక కంప్లయింట్’’ విసుగ్గా చెప్పాడు బుచ్చారెడ్డి. ‘‘ఒక పనిచెయ్యి, మీకు ఇంకా ముగ్గురు కొడుకులున్నారు కదా… వీడిని మాకు ఇచ్చెయ్. మా ఇంట్లో ఉంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తాను’’ అని బెనెట్ అడగ్గానే బుచ్చారెడ్డి తలూపాడు. ఇక అప్పటి నుంచి జి.పి.రెడ్డి లైఫ్‌స్టయిల్ మారిపోయింది. బెనెట్ భార్య మేరీవిల్సన్‌కి కూడా ఈ అబ్బాయి తెగ నచ్చేశాడు. ఇంకేం, రెడ్డికి అమ్మానాన్నలతో పాటు మమ్మీడాడీ కూడా వచ్చేశారు. అప్పటివరకూ చదివిన ఒకటోక్లాస్‌కి టాటా చెప్పి బెనెట్‌గారి వెంట తిరుగుతూ బతుకు పాఠాలు నేర్చుకోవడం మొదలెట్టాడు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…

సొంతబిడ్డలా చూసుకునేవారు…

మా ప్రాంతంలో ఇరవైవేలమంది తెల్లోళ్లు ఉండేవాళ్లు. బెనెట్ దొర టీమ్‌లో నేనూ ఒకడినన్నమాట. తొమ్మిదేళ్ల వయసుకే… నిలబడి జీప్‌ని డ్రైవ్ చేసేవాడిని. రోజూ పొద్దున్నే రెండు గుడ్లు తిని, పాలు తాగాక పది కిలోమీటర్లు పరిగెత్తించేవారు. సాయంత్రం వాలీబాల్, హాకీ ఆడేవాడిని. బెనెట్‌సార్‌కి పిల్లలు లేరు. నన్ను సొంతబిడ్డలా చూసుకునేవారు. పనులు నేర్పించేదగ్గర మాత్రం చాలా స్ట్రిక్ట్. పదేళ్ల వయసొచ్చేసరికి బెనెట్‌సార్ జీపు డ్రైవర్ జాబ్ ఇచ్చారు. అప్పట్లో వారానికోసారి జీతం ఇచ్చేవారు. నాకు పద్నాలుగేళ్ల వయసప్పటికే యుద్ధ ట్యాంకర్ డ్రైవింగ్ శిక్షణ ఇప్పించారు బెనెట్‌సార్.

విదేశీయానం…

బెనెట్‌సార్‌తో షిప్‌లో ఇంగ్లండ్, స్కాట్‌లాండ్, అరబ్ దేశాలన్నీ తిరిగాను. తెల్లవారి దగ్గర ఉద్యోగం సంగతి ఎలా ఉన్నా… వారి మధ్య కాలక్షేపం మాత్రం భలే సరదాగా ఉండేది. జీతం అందగానే మా టీమ్ అందరినీ మూకీ సినిమాకి తీసుకెళ్లేవాడిని. పొద్దున్నే నాలుగింటికి స్నానం చేసి హనుమాన్ గుడిలో పూజ చేసుకునేవాడిని. బెనెట్‌సార్ నా పద్ధతులు చూసి మెచ్చుకునేవారు. ‘‘మా డిసిప్లిన్ వల్ల శరీరం మాత్రమే ఆరోగ్యంగా ఉంటుంది. మీ పద్ధతులు, ఆచారాలు మనసుని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి’ అనేవారు. ఒకరోజు మా టీమ్‌లోని జాన్సన్ అనే వ్యక్తి ‘‘నాకు తెలుగు నేర్పించవా’’ అని అడిగాడు. నేను సరదాగా ‘నీ కాల్మొక్త బాంచన్’ అని పలకమన్నాను. రెండు రోజులు నానా తంటాలు పడి ఆ పదం నేర్చుకుని, కనిపించిన ప్రతి తెలుగువాడి దగ్గర ఆ పదం పలకగానే అందరూ నవ్వేవారు. ఊహ తెలిసేనాటికే తెల్లోళ్లు నా కళ్ల ముందు ఉండేసరికి వారిపై నాకు కోపం కలిగేది కాదు. అయితే పెద్దయ్యాక మాత్రం… మన దేశంపై పెత్తనం చెయ్యడానికి వీళ్లెవరనే ఆలోచన వచ్చింది.

ఆ ఎనిమిది గంటలే…

మహాత్మాగాంధీ ఉప్పుసత్యాగ్రహం సమయం లో ఉద్యోగంలో భాగంగా బ్రిటిష్ అధికారులతో పాటు నేను కూడా వెళ్లాను. ‘వందే మాతరం’ అనే పదం తప్ప ఇంకేం వినిపించడం లేదు. జీప్ దిగకుండానే నేను కూడా రెండు చేతులూ ఎత్తి ‘వందే మాతరం’ అంటూ అరిచాను. పక్కనే కూర్చున్న ఓ బ్రిటిష్ అధికారి నా చేతులు పట్టుకుని ‘నువ్వు అరవకూడదు’ అంటూ కళ్లెర్రజేశాడు. సాయంత్రం బెనెట్‌సార్‌కి జరిగిందంతా చెప్పాను. ఆయన ‘‘డ్యూటీలో ఉన్నప్పుడు ఆ పని మాత్రమే చేయాలి’’అన్నారు. అహ్మదాబాద్ నుంచి తిరిగొచ్చేటప్పుడు ఓ పది తెల్లటోపీలు తెచ్చుకున్నాను. పొద్దున్న తొమ్మిదింటి నుంచి ఐదు గంటలవరకూ బ్రిటిషర్స్ క్యాప్ పెట్టుకుని ఐదు దాటగానే గాంధీటోపీ పెట్టుకునేవాడిని. తెల్లదొరల కళ్లుగప్పి సుభాష్‌చంద్రబోస్ ఏర్పాటుచేసే రహస్య సమావేశాలకు హాజరయ్యేవాడిని. ఆ వివరాలు తెలిసి మా టీమ్‌లోవాళ్లు నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేవారు. నేను నా కోతిచేష్టలతో వారిని ఏడిపించేవాణ్ణి. గట్టిగా ఏమన్నా అంటే బెనెట్‌సార్‌తో చెబుతానని బెదిరించేవాణ్ణి.

మమ్మీడాడీకి టాటా…

1947 ఆగస్టు 15. స్వాతంత్య్రం వచ్చింది. భారతీయుల మొహాలు కోటికాంతులతో వెలిగిపోతున్నాయి. ఆ ఉత్సవాల్లో నేను కూడా చేరాను. బెనెట్‌సార్ నుంచి కబురొచ్చింది. పరుగుపరు గున వెళ్లాను. మేరీమమ్మీ నన్ను దగ్గరికి తీసుకుని ‘‘మాతో వస్తావా’’ అని అడిగింది. ‘‘ఎందుకు రాడు’’ అన్నాడు బెనెట్‌సార్ ఎంతో నమ్మకంగా. ‘‘నేను మీతో వచ్చేస్తే… మా అమ్మానా న్నలు ఏమైపోతారు’’ అన్నాను. ‘‘వాళ్లను నువ్వు చూడ్డం ఏంటి?’’ అన్నారు. ‘‘మీదగ్గర ఉద్యోగం చేసింది ఎవరి కోసం అనుకుంటున్నారు?’’ అని నేను చెప్పిన సమాధానానికి బెనెట్‌సార్ నోరు మెదపలేదు. ‘‘భారతీయుల కుటుంబ సంబంధాలు చాలా గొప్పవి. నువ్వెక్కడున్నా మా మనసు నీమీదే ఉంటుందిరా’’ అని బెనెట్‌సార్ నన్ను కౌగిలించుకున్నారు. ఆయన వెళ్తూవెళ్తూ యుద్ధట్యాంకర్ డ్రైవింగ్‌లో నాకున్న అనుభవం గురించి ఒక లెటర్ రాసి, అది చూపిస్తే భారతప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందన్నారు. వారి గుర్తుగా నా భవిష్యత్తుకి భరోసాగా రంగారెడ్డిజిల్లాలో ఐదెకరాల పొలం రాసిచ్చారు.

నా దేశం కోసం…

బెనెట్‌సార్ లెటర్ చూపిస్తే నాకెవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. చేసేది లేక నాన్నతో పాటు సేల్స్‌మన్‌గా కొన్నాళ్లు పనిచేశాను. నాకు అప్పటికే పెళ్లయి ిపిల్లలు కూడా. స్వాతంత్య్రం వచ్చిన నాలుగేళ్లకు చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తోందని మన ఆర్మీని అక్కడికి పంపారు. అప్పుడు కొందరు ఆర్మీ అధికారులు నా దగ్గరకు వచ్చి చైనా సరిహద్దుల్లో యుద్ధట్యాంకర్లను నడపడానికి రమ్మన్నారు. నా దేశాన్ని కాపాడుకునే అవకాశాన్ని వదులుకోకూడదని రోజుకూలీగా చేరాను. నాలుగు నెలలపాటు యుద్ధట్యాంకర్‌ని నడిపాను. యుద్ధం లో భాగంగా ఇద్దరు చైనా జవాన్లను సజీవంగా పట్టుకుని మన అధికారులకు అప్పగించాను. ఆ సంఘటనను గుర్తుచేస్తూ రెండేళ్లక్రితం పంజాబ్ నుంచి కొందరు అధికారులు వచ్చి అక్కడి సైనికులకు పాఠాలు చెప్పమని అడిగారు. నేను వెళ్లలేదు. తొంభైఏళ్లు దగ్గరపడుతుండగా నేనేం చెప్పగలను? ఇన్నాళ్లకు మన దేశానికి నేను గుర్తొచ్చానా… అన్న బాధ కూడా నన్ను ముందుకు పంపలేదు. చైనావార్ తర్వాత ముంబైలోని ‘సారాబాయ్ కెమికల్స్’లో ఉద్యోగ అవకాశం వచ్చి, వెంటనే చేరిపోయాను. 35 ఏళ్లు అక్కడే ఉండి పనిచేశాను.

ఆనాటి బంధం ఈనాటికీ…

నాకు నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. అందర్నీ పెద్ద చదువులు చదివించాను. నేను ఉద్యోగం పేరుతో దూరంగా ఉండేవాడిని. నా భార్య ఉన్నంతవరకూ బిడ్డలదగ్గరే ఉండేవాడిని. ఆ తర్వాత కరీంగూడ గ్రామంలో నా కూతురు తోటలో ఉంటూ కాలక్షేపం చేశాను. ప్రస్తుతం మౌలాలిలో ఉన్న కూతురింటి దగ్గర ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాను. తెల్లదొరలిచ్చిన ఐదెకరాలు ఎప్పుడో కరిగిపోయాయి. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేదు. పేదవాడు… కొడుకులకు కూడా బరువే. నేను మాత్రం రాజీపడలేదు. మానవహక్కుల కమిషన్‌లో కేసు వేశాను. నా పోషణ నిమిత్తం ఇంత సొమ్ము కావాలని అడిగాను. అప్పటినుంచి ప్రతినెల వాళ్లు డబ్బులు పంపుతున్నారు. మన దేశం కోసం ఆ తెల్లదొరల దగ్గర పోరాడని పాపానికి ఈ రోజు బతకడానికి బిడ్డలతో పోరాడాల్సి వస్తోందా! అనిపిస్తుంటుంది.

మన దేశం వదిలింది మొదలు ఇప్పటివరకూ బ్రిటిష్‌వారు ఏటా నాకు డబ్బులు పంపిస్తున్నారు. రెండు మూడు నెలలకొకసారి పోస్టాఫీసు దగ్గర నుంచి కబురొస్తుంది. వెళ్లి తెచ్చుకుంటాను. ఒకోసారి రెండు వేలు, ఒకోసారి మూడువేల రూపాయలుంటాయి. ప్రతినెలా ఢిల్లీలో ఉన్న చీఫ్ ఇన్ కమాండర్‌కి నేను బతికున్నట్లు లెటర్ పంపుతాను. దాన్నిబట్టి బ్రిటిష్ అధికారులు నాకు పంపిన డబ్బుని నా అడ్రస్‌కి పంపుతారు. వాళ్ల దగ్గర పట్టుమని పాతికేళ్లు కూడా పనిచేసి ఉండను. అయినా నన్ను వారి మనిషిగా భావించి, పోషిస్తున్నారు. నిజంగా వాళ్లు దొరలే… అంటూ ఆ పెద్దాయన అనర్గళంగా ఆంగ్లంలో చెబుతుంటే వినసొంపుగా అనిపించింది.

– భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి;
ఫొటోలు: గడిగె బాలస్వామి

**********

ఆదివారం వచ్చిందంటే మటన్ స్పెషల్ ఉండాలి వాళ్లకి. అయితే మేకనైనా, కోడినైనా కోసేముందు పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించి, ఆరోగ్యంగా ఉందంటేనే కోయించేవారు.

పొద్దున్న తొమ్మిదింటికి విధులకు హాజరయ్యేటప్పుడు షర్టు చేతులు మోచేతి వరకూ మడిచి, సాయంత్రం ఐదింటికి డ్యూటీ అయిపోయాక మడత విప్పేసి ఫుల్‌హ్యాండ్స్ బటన్ పెట్టేస్తారు. వారి మధ్యన పెరిగినవాడిని కదా! ఇప్పటికీ నాకు ఆ అలవాటు పోలేదు.
– జి.పి.రెడ్డి

కేక్ కట్ చేస్తారు…హార్ట్ టచ్ చేస్తారు

జీవితం ఒక తియ్యని వేడుక.
అందరికీనా?
అవును. పిల్లల మధ్య గడిపేవారందరికీ!
పిల్లల్లో కలిసిపోతే…
పెద్దవాళ్లక్కూడా ఆడిపాడాలనిపిస్తుంది.
స్ఫూర్తి హోమ్ పిల్లలతో కలిస్తే మాత్రం…
ఆటపాటలతో పాటుబర్త్‌డే కూడా జరుపుకోవాలనిపిస్తుంది.
అంత తియ్యగా సెలబ్రేట్ చేస్తారు వారు!
సంతోషాన్ని పంచాలని వచ్చే విజిటర్స్…
చివరికి పిల్లలు పంచిన సంతోషాన్ని తమ గుండెల్లో నింపుకుని వెళతారంటే చూడండి…
అరేంజ్‌మెంట్స్ ఎలా ఉంటాయో!
ఆ అనాథ పిల్లలు జరిపే ఆత్మీయ వేడుకలే ఈవారం ‘ప్రజాంశం’.

అనాథపిల్లలు, అనాథ వృద్ధుల సమక్షంలో ఆనందంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అరుదైన సంగతేమీ కాదు. ఎందుకంటే అనాథాశ్రమాల్లో మనం పుట్టినరోజు చేసుకుంటున్నామంటే… ఆ పిల్లలు మనబోటి అతిథులు తెచ్చే చాక్లెట్ల కోసం ఎదురుచూస్తారని, కొత్తబట్టిలిస్తే ఆనందపడతారని అనుకుంటాం. అయితే ‘స్ఫూర్తి ఆర్ఫన్ హోమ్’ లోని పిల్లలు మాత్రం వచ్చిన అతిథిని ఎలా సంతోషపరచాలా అని ఆలోచిస్తారు. అతిథి పుట్టినరోజు వచ్చిందంటే చాలు వారి ఆశ్రమాన్ని అందంగా అలంకరించేస్తారు. ఇటువంటి ఆర్ఫన్‌హోమ్స్ గురించి చాలామందికి తెలియదు. ‘స్ఫూర్తి’ ఫౌండేషన్ హోమ్‌లో జరిగే అతిథుల పుట్టినరోజు వేడుకల వెనక ఉన్న ఉత్సాహం గురించి ఉల్లాసంగా చెప్పేదే ఈ కథనం…

spurthi1

సినిమారంగం, రాజకీయరంగం, ఐటి ఉద్యోగులు, టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులు… చాలామందికి ‘స్ఫూర్తి’ ఆశ్రమంలోని పిల్లల సన్నిధి నచ్చుతుంది. ఓ గంట కాలక్షేపం చేసి వెళ్లిపోదాం అనుకుని వచ్చినవారు అక్కడ నుంచి వెంటనే కదలలేకపోతారు. లంచ్ టైమ్‌కి వచ్చినవాళ్లు డిన్నర్ కూడా చేసి వెళతారు. ఆ పిల్లల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే… ‘సెలబ్రేషన్’ అంటారు ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీవ్యాల్. ‘‘మా హోమ్‌లో పుట్టినరోజు జరుపుకునేవారు ముందుగానే ఫోన్ చేస్తారు. దాంతో మా పిల్లలు ఆ రోజు సాయంత్రానికల్లా హోమ్‌ని అందంగా అలంకరించేస్తారు.

క్యాండిల్ దగ్గర నుంచి వెల్‌కమ్ బెలూన్ల వరకూ అన్నీ సిద్ధం చేస్తారు. ఒకవేళ వచ్చేది పెద్ద సెలబ్రెటీ అయితే, వెల్‌కమ్ బ్యానర్లు కూడా సిద్ధం చేస్తారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి నా ప్రమేయం ఏమీ ఉండదు. అంతా మా పిల్లలే చూసుకుంటారు. పాటలు, డ్యాన్సులు… అన్ని ఏర్పాట్లూ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. పుట్టినరోజు జరుపుకునేవారు చిన్న పిల్లలైతే… బెలూన్లు, బొమ్మలతో అలంకరిస్తారు. అదే పెద్దవాళ్లయితే రంగురంగుల పూలు, మంచిమంచి వాక్యాలతో అలంకరిస్తారు. ఇవీన్న చూసి వచ్చిన అతిథులు ఆనందిస్తారు’’ అని చెప్పారు శ్రీవ్యాల్.

స్కూలు ఆలోచన…

అమెరికాలో ఎమ్‌ఏ చదువుకున్న శ్రీవ్యాల్‌కి అనాథాశ్రమం స్థాపించాలన్న ఆలోచన రావడం వెనుక ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. చదువు పూర్తయ్యాక పేదపిల్లల కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాలను స్థాపిద్దామనుకున్నాను. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాక కొంతకాలం ఉద్యోగం చేశాను. ‘అన్నమో రామచంద్రా!’ అంటూ అన్నం కోసం అల్లాడే అనాథపిల్లలు కొందరు కంటపడడంతో, పాఠశాల కంటె ముందు, అనాథాశ్రమం స్థాపించాలనుకున్నాను. 2006లో హైదరాబాద్ చర్లపల్లి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని ‘స్ఫూర్తి’ పేరుతో ఆశ్రమం ప్రారంభించాను. ముగ్గురు పిల్లలతో ప్రారంభమైన ఈ ఆశ్రమంలో ఇప్పుడు 192 మంది అనాథ పిల్లలున్నారు.

మొదట్లో నా ఆలోచనకు కేవలం నలుగురు స్నేహితులు మాత్రమే అండగా నిలబడ్డారు. రోజులు గడిచేకొద్దీ నన్ను అర్థం చేసుకునేవారి సంఖ్య పెరిగింది. కొందరు ఎన్నారై మిత్రులతోబాటు ఇక్కడిస్నేహితులు, బంధువులు, ప్రైవేటు స్కూలు టీచర్లు… ఇలా దాతల సర్కిల్ పెంచుకున్నాను. మా హోమ్‌లో పిల్లల్ని చేర్పించడానికి… పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పరిచయస్థులు ఫోన్లు చేస్తూనే ఉంటారు’’ అన్నారు శ్రీవ్యాల్. ఆయన చెప్పే మాటలకు సాక్ష్యాలుగా కనిపిస్తాయి ఆ హోమ్ గోడలపై ఉన్న పెయింటింగ్స్. ఈ ఏడాది జూన్‌లో ఈ హోమ్ పిల్లలు వేసిన పెయింటింగ్స్‌ని బంజారాహిల్స్‌లోని ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రం ఫొటో ఎగ్జిబిషన్ గా ప్రదర్శించింది.

ఫస్ట్ బర్త్‌డే ప్రత్యేకత

 ‘‘మా హోమ్‌లో వారానికొక గెస్ట్ పుట్టినరోజు తప్పనిసరిగా ఉంటుంది. తమ చిన్నారుల మొదటిపుట్టినరోజు మాతో కలసి చేసుకోవాలనుకునేవారు నెలకు, రెండు నెలలకు ఒకసారి వస్తుంటారు. ఫస్ట్ బర్త్‌డే అనగానే మా పిల్లలకు ఎక్కడిలేని సంతోషం వస్తుంది. ఎందుకంటే ఆ రోజు వచ్చే అతిథులు మా పిల్లలకు కొత్తబట్టలు తేవడం, మధ్యాహ్నం స్పెషల్ భోజనం… చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇవ్వడం వంటి ప్రత్యేకతలుంటాయి. ఇక సెలబ్రిటీలైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు తమతో గడపడమే పెద్ద బహుమతిగా భావిస్తారు మావాళ్లు. వీరు గాక కాలేజీ పిల్లలు, ఐటి ఉద్యోగులు కూడా వచ్చి, దాదాపు వీకెండ్స్ అంతా ఇక్కడే గడుపుతారు. ఈ పిల్లలతో క్యారమ్స్, ఫుట్‌బాల్, క్రికెట్… వంటి ఆటలు ఆడుతూ టైమ్‌పాస్ చేస్తారు’’ అని చెప్పారు శ్రీవ్యాల్.

తల్లిదండ్రులు లేని పిల్లలను అక్కున చేర్చుకోవడం బాగానే ఉంటుంది. కాని వారు ఆశ్రమంలో ఉన్నంతకాలం వారికి ఎటువంటి సమస్యలు రాకుండా ఆనందంగా ఉంచడం చాలా కష్టం. ఆ కష్టాన్ని శ్రీవ్యాల్ అధిగమించారనే చెప్పాలి. పిల్లల్ని చదివించడంతో పాటు, ఆడిస్తుంటారు. అప్పుడప్పుడు జూపార్క్‌కి, సినిమాలకు, పార్కులకు, సాంస్కృతిక కార్యక్రమాలకు తీసుకెళ్తారు. మరి అంతమందిని బయటికి తీసుకెళ్లడమంటే మాటలు కాదు. అందుకే తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సాయం చేస్తామని ముందుకొచ్చినవారితో ‘‘మా పిల్లలు ఫలానా ప్రోగ్రామ్ చూడాలంటున్నారు’ అని మాత్రం చెబుతారు. ఇష్టమైనవారు దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. లేదంటే నేనే చేసుకుంటాను’’ అంటారు శ్రీవ్యాల్.

అనాథ పిల్లలను సొంత పిల్లల్లా అక్కున చేర్చుకుని నిరంతరం వారిని ఉత్సాహంగా ఉంచుతున్న శ్రీవ్యాల్ సేవలు అభినందనీయం.

– భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

ఈ డబ్బంతా నా కష్టార్జితం కాదు దాతల దొడ్డమనసు
 ‘‘ప్రస్తుతం మా హోమ్ పిల్లలంతా ప్రైవేటు స్కూల్స్‌లో చదువుకుంటున్నారు. వీరి కోసం భవిష్యత్తులో సొంతంగా స్కూలు నిర్మించాలనుకుంటున్నాను. మా హోమ్‌లో పిల్లలకే కాకుండా బయట పాఠశాలల్లోని 30మంది పేద విద్యార్థులకు స్కూలు ఫీజు చెల్లిస్తున్నాను. ఈ డబ్బంతా నా కష్టార్జితం కాదు. దాతల దొడ్డమనసు. స్ఫూర్తి పిల్లలు పదిమందికి స్ఫూర్తిగా ఎదగాలని కోరుకునేవారి కోరిక ఫలితమే మా పిల్లల కళ్లలోని వెలుగుల రహస్యం’’
– శ్రీవ్యాల్

ప్రేక్షకుల్ని పుట్టించుకోవాల్సిందే!

తొలి సినిమా నుంచే తనదైన పంథాలో పయనించిన యువదర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘గ్రహణం’ సినిమాతో తొలిదర్శకుడిగా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నా, ఆ తర్వాత తీసిన ‘మాయాబజార్’తో పరాజయం చవిచూశారు. విమర్శలే కాదు పలురకాల ఆత్మవిమర్శలతో రాటు తేలిన పిదప ఆయన తీసిన ‘అష్టాచమ్మా’ సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ‘గోల్కొండ హైస్కూలు’ సినిమా ఒక మోస్తరుగా నడిచినా ఇప్పుడొచ్చిన ‘అంతకు ముందు- ఆ తరువాత’ మళ్లీ విజయాన్ని కట్టబెట్టింది. దశాబ్ద కాలపు సినీ జీవితంలో మోహనకృష్ణకు ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం అనుభవం.

bharani
కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ఉన్నా, టీచింగ్‌లోకి వెళ్లొచ్చని పిహెచ్.డిలో చేరినా అంతిమంగా సినిమా రంగం పట్ల నాకున్న ఇష్టం నన్ను ఒక దర్శకుడిగా నిలబెట్టింది. మా నాన్న శ్రీకాంత శర్మ గారి కారణంగా ఇంట్లో ఏర్పడిన సాహిత్య వాతావర ణం, మా అమ్మ జానకీబాలగారి కారణంగా ఏర్పడిన సంగీత వాతావరణం బహుశా నేను ఈ వైపు రావడానికి ప్రధాన కారణమేమోనని నాకు అనిపిస్తూ ఉంటుంది.

1997లో నేను 50 ఏళ్ల భారత స్వాతంత్య్రం సందర్భంగా ‘మహాంధ్ర’ అన్నపేరుతో ఒక డాక్యుమెంటరీ చేశాను. దాదాపు 1870 నుంచి 1947 వరకు రాష్ట్రంలో రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, ఇతరత్రా వచ్చిన మార్పులేమిటి? అన్న విషయం తీసుకుని ఆ డాక్యుమెంటరీ చేశాను. జెవి సోమయాజులు నిర్మాతగా వ్యవహరిస్తే పవన్‌కుమార్ మాన్వి దానికి దర్శకత్వం వహించారు. దానికి సంబంధించిన పరిశోధన, రచన నేనే చేశాను.

సినిమా గురించిన ఒక అవగాహన కలిగించింది ఆయనే. అందువల్ల సినిమా లోకానికి సంబంధించినంత వరకు మాన్విగారు నా తొలిగురువు. సినిమా రచన గురించి, దర్శకత్వం గురించి ఎన్నో విషయాలు నేను అయన నుంచి నేర్చుకున్నాను. ఆయన సలహా మీదే కెనడా వెళ్లి అక్కడో యూనివర్సిటీలో ఎం. ఎఫ్.ఏ (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ) చేశాను. ఆ తరువాత పిహెచ్.డిలో జాయిన్ అయ్యి ఒక సంవత్సరం ఉండి అంటే 2001లో సినిమా చెయ్యాలని నిర్ణయించుకుని ఇండియాకు తిరిగి వచ్చేశాను.

అడుగు మోపాకే తె లిసిందిసినిమా రంగంలో అడుగిడిన నాటి నుంచే మొదలయ్యాయి నా కష్టాలు. ఎవరికైనా ప్రత్యక్షంగా ఆ రంగ ంలోకి దిగేదాకా దానికి సంబంధించిన కష్టాలేం తెలుస్తాయి! కనిపించిన ప్రతి నిర్మాతకూ కథలు వినిపించేవాడ్ని. అలా ఓ మూడేళ్లు గడిచాయి. కానీ, ఎక్కడా సానుకూల స్పందన లేదు.

ఒక్కోసారి అనవసరంగా ఇండియాకు తిరిగొచ్చేశానేమో అనిపించేది. ఏమైనా ఈ రంగంలోకి ప్రవేశించడం అంటే ఏటికి ఎదురీదడమేనని నాకు అర్థమైపోయింది. ఎవరి వద్దకు వెళ్లినా ‘ సరేలేవయ్యా, విదేశాలకు వెళ్లానంటున్నావు. బాగా చదువుకున్నానంటున్నావు. కానీ, అసలు నువ్వు సినిమా తీయగలవని మాకు నమ్మకమేంటి? ఇంత వరకు నువ్వు ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. ఏం చిత్రిస్తావో మాకేం తెలుసు? ఇప్పుడు నీ మీద అంత డబ్బు ఎలా పెడతాం?” అంటూ అడి గేవాళ్లు.

అదీ నిజమేననిపించింది. నువ్వేమిటో, నీ సామర్థ్యం ఏమిటో ఏమీ తెలియకుండా ఎవరైనా లక్షల్లో, కోట్లలో ఎలా ఖర్చు చేస్తారు? మన మీద మనం ఖర్చు చేసుకుని మనల్ని మనం నిలబెట్టుకోవడం తప్ప మరోమార్గం లేదనిపించింది. వెంటనే అంటే 2003లో 30 నిమిషాల నిడివితో ‘చలి’ అనే చిన్న సినిమా (ఫీచర్ ఫిల్మ్) తీశాను.

నిర్మాతలు, దర్శకులు ఎవరు కనిపించినా వారికి ఒక సీడీ ఇచ్చే వాడ్ని. అది చూసి చాలా మంది బాగుందనే అన్నారు. తనికెళ్ల భరణి గారు కూడా చూశారు.అంతకు ముందే ఆయనతో నాకు కొంత పరిచయం ఉంది. చలం గారి రచన ఆధారంగా నేను తయారు చేసుకున్న ‘గ్రహణం’ అనే స్క్రిప్ట్ నా వద్ద ఉంది, అందులోని ప్రధానపాత్రను చేయడానికి మీరు అంగీకరిస్తే సినిమా చేద్దాము అన్నాను.

‘చలం గారి కథే అయితే చేస్తా. నాకు డబ్బులేమీ అక్కర్లేదు’ అంటూ వెంటనే ఒప్పేసుకున్నారు. ఈ మాటే అమ్మతో చెప్పాను. ‘మూడు లక్షల్లో తీయగలవా మరి?. నా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను బ్రేక్ చేసి నీకు 3 లక్షల రూపాయలు ఇచ్చేస్తాను’ అంది. వెనకా ముందు ఆలోచించకుండా సరే అన్నాను. ఆ మాటే భరణి గారికి చెబితే నవ్వేశారు. అలా కాదు గానీ, ఎలాగోలా ఇంకొంచెం పెంచుదాం అన్నారు.

మొత్తంగా చూస్తే అన్నీ కలిపి 18 లక్షల దాకా ఖర్చయ్యింది. అప్పుడు నేషనల్ అవార్డుకు పంపిస్తే, దానికి జాతీయ స్థాయిలో ఉత్తమ తొలి దర్శకుడిగా నాకు అవార్డు వచ్చింది. అక్కడినుంచి కెరీయర్‌కు ఒక టేకాఫ్ దొరికింది.విజయం, సమస్య కలగలిసిగ్రహణం సినిమాతో నాకు బాగా పేరొచ్చిన మాట నిజమే కానీ, చిత్ర పరిశ్రమ నన్ను పూర్తిగా ఆర్డ్ ఫిలిం డైరెక్టర్ల జాబితాలో చేర్చివేసింది. మరో సినిమా చేసే అవకాశం నాకెవ్వరూ ఇవ్వలేదు.

నేను బాగా కష్టాల్లో పడిపోయాను.. నేను ఏ సినిమా తీసినా ‘గ్రహణం’ మూసలో తీస్తాననే ముద్ర ఒకటి పరిశ్రమ వేసింది. అయినా ఆ కష్టకాలంలో ‘మిస్సమ్మ’ తీసిన వి సత్యనారాయణ ఒక సినిమా తీద్దామని నా వద్దకు వచ్చారు. ఆయనతో చేసిందే ‘మాయాబజార్.’ కానీ, అది ఆశించినంత బాగా ఆడలేదు. దానికి రకరకాల కారణాలు చెప్పారు. కథ పాత పద్దతిలో ఉందని, కుర్రకారుకు అది పట్టలేదని, ఆదర్శాల పాలు ఎక్కువైపోయిందనీ అన్నారు.

వ్యక్తిగతంగా నాకు మాయాబజార్ సినిమా అంటే చాలా ఇష్టం కానీ కమర్షియల్‌గా విజయవంతం కాకపోవడంతో నేను మానసికంగా దెబ్బతిన్నాను. దాదాపు ఏడాది పాటు విపరీతమైన అంతర్మధనానికి గురయ్యాను.తీవ్రమైన డిప్రెషన్‌లో ఉండిపోయాను. మనిషి మీద ఒక ముద్ర పడితే అది ఒక్కోసారి జీవితకాలపు ముద్ర అవుతుందని అప్పటిగ్గాని నాకు తెలిసి రాలేదు

.అది ఆయన సాహసమేఏం చేయాలో తోచక కొట్టుమిట్టాడుతున్న సమయంలో రామ్మోహన్ అనే ఒక స్నేహితుడు నాకోసం వెతుక్కుంటూ వచ్చాడు. రామానాయుడు స్టూడియోలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా కూడా ఉండేవాడు. నేను తరుచూ ఆ స్టూడియోకు వెళ్లడం, కథలు చెప్పడం చేసేవాడ్ని. అలా పరిచయం అయిన వాడే అతను. ఆయన నా వద్దకు వచ్చి, నాకో సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఉంది. ‘మాయాబజార్’ ఫెయిల్యూర్ విషయం పక్కకు పెట్టు. నాకు నీ టాలెంట్ మీద నమ్మకం ఉంది. మనం ఓ సినిమా చే ద్దాం అన్నాడు.

అప్పుడాయనకు నేను ‘అష్టాచమ్మా’ కథ చెప్పాను. ఆ సినిమా విడుదలై గొప్ప విజయం సాధించింది. ఆర్ట్ సినిమాలే కాదు ఇతను వినోదాత్మకంగా కూడా తీయగలడు అన్న భావనను పరిశ్రమలో స్థిరపరిచింది. ఈ క్రెడిట్ పూర్తిగా రామ్మోహన్‌కే దక్కుతుంది. ‘అష్టాచమ్మా’ విజయం తర్వాత అదే బ్యానర్ కింద ‘గోల్కొండ హైస్కూల్ ‘అనే సినిమా చేశాను. ఇది బ్లాక్‌బ్లస్టర్ కాకపోయినా, ఒక మేరకు సక్సెస్ సాధించింది.

కాకపోతే నాకు దర్శకుడిగా విపరీతంగా పేరొచ్చింది. ఇప్పుడొచ్చిన ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాలో ఒక భిన్నత్వం ఉందని ప్రేక్షకులనుంచి ప్రశంసలొచ్చాయి.ప్రేక్షకుల సృష్టి జరగాలి’అష్టాచమ్మా’ విజయం నాకు ఎన్నో కొత్త పాఠాలు నేర్పింది. పేక్షకులకు ఏం కావాలా వాటిని మనం ఊహిస్తూ కూర్చోవడం కన్నా, మనం నమ్మిన దాన్ని ఎంత పక్కాగా తీయగలిగితే అది ప్రేక్షకుల్ని అంత తొందరగా చేరుతుందని అనిపించింది.

సినిమాలో వినోదం తప్పనిసరిగా ఉండాలి. అయితే ఎలాంటి వినోదం ఇవ్వాలనేది దర్శకుడు నిర్ణయించుకోవాలి. దర్శకుడు తన ప్రేక్షకుల్ని సృష్టించుకునే క్రమం కూడా ఇందులో భాగంగా ఉంటుంది.

హీనమైన వినోదం ఇస్తే ఆ స్థాయి ప్రేక్షకులే పుట్టుకొస్తారు. ఉన్నతమైన వినోదాన్ని ఇస్తే ఉన్నతమైన ప్రేక్షకులు పుడతారు.మనం తక్కువ సంస్కారవంతమైన వినోదానికి ఎక్కువ కాలం అలవాటు పడి వేరొకరకమైన వినోదాన్ని చూసి ఆనందించగల స్థాయి వారిలో తగ్గిపోవచ్చు. అలాంటి స్థితిలో అటువంటి వినోదంతో వ చ్చే సినిమాల్ని వారు అర్థం చేసుకోలేరు. వాటిని అర్థం చేసుకోవడానికి, ఆస్వాదించడానికి, అభినందించడానికి వారికి టైం పడుతుంది.

అస్తమానం పడిపోతున్న విలువల విషయమై తిట్టుకుంటూ కూర్చోకుండా ఆ తరహా ప్రేక్షకుల్ని సృష్టించుకోవడం తప్పనిసరి అన్న సత్యం నాకు స్పష్టంగా బోధపడింది.

– బమ్మెరఫోటోలు: రాజ్‌కుమార్